స్టాండింగ్ కమిటీ పరిశీలన
న్యూఢిల్లీ: ఎన్నారై పెళ్లి సంబంధాలలో మోసాలను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘రిజిస్ట్రేషన్ ఆఫ్మ్యారేజ్ఆఫ్ నాన్ రెసిడెంట్ ఇండియన్ బిల్2019’ను పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి రాజ్యసభ సిఫార్సు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది. రాజ్యసభ చైర్మన్తో సంప్రదింపుల తర్వాత విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీకి రిఫర్ చేసినట్లు లోక్ సభ స్పీకర్ వెల్లడించారు. పెళ్లి పేరుతో మహిళలను ట్రాప్ చేసి, వారిపై వేధింపులకు పాల్పడుతున్న ఎన్నారై పెళ్లికొడుకులపై చర్యలు తీసుకునేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది.
ఈ కొత్త బిల్లు చట్టంగా మారితే.. ఇండియన్యువతిని పెళ్లి చేసుకున్న ఎన్నారై(ఇండియాతో పాటు బయట చేసుకున్న వివాహం కూడా) నెల రోజుల వ్యవధిలో తన పెళ్లిని రిజిస్టర్ చేసుకోవాలి. ఒకవేళ 30 రోజులు దాటినా రిజిస్టర్ చేసుకోకుంటే.. సదరు ఎన్నారై పాస్పోర్టును స్వాధీనం చేసుకునే/రద్దు చేసే అవకాశం అధికారులకు ఉంటుంది. దీంతో పాటు సదరు ఎన్నారైకి ఇండియాలో ఉన్న ఆస్తులను జప్తుచేసే అవకాశమూ ఉంటుంది.