బీజేపీలోకి ఎన్ఆర్ఐ స్మితారెడ్డి

బీజేపీలోకి ఎన్ఆర్ఐ స్మితారెడ్డి

ప్రవాస భారతీయురాలు, వ్యాపారవేత్త బోదనపల్లి స్మితారెడ్డి బీజేపీలో చేరారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడకు చెందిన స్మితారెడ్డి ఈరోజు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, అధికార ప్రతినిధి టి.వీరేందర్ గౌడ్ లతో కలిసి కోరుట్ల నియోజకవర్గంలోని మెట్ పల్లి ప్రజాసంగ్రామ యాత్ర లంచ్ శిబిరం వద్దకు వెళ్లారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్.. స్మితారెడ్డికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ సిద్ధాంతాలు, విధానాలకు ఆకర్షితురాలినై పార్టీలో చేరుతున్నట్లు స్మితారెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపే ధ్యేయంగా పని చేస్తానన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో క్రియాశీలక పాత్ర పోషిస్తానని చెప్పారు.