‘కరోనా మరణాలను తగ్గించి చెప్తున్నారు’

‘కరోనా మరణాలను తగ్గించి చెప్తున్నారు’
  • ఆరోపించిన ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్‌

హైదరాబాద్‌: ప్రభుత్వం కరోనా మరణాలను తగ్గించి చెప్తోందని ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బలమూరు వెంకట్‌ ఆరోపించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు హాస్పిటళ్లకు కూడా తప్పుడు లెక్కలు చెప్తున్నాయని అన్నారు. శ్మశాన వాటికల దగ్గర దహనం చేస్తున్న మృతదేహాల సంఖ్య ఎక్కవుగా ఉందని, ప్రభుత్వ లెక్కలు మాత్రం తక్కువగా ఉన్నాయని వెంకట్‌ అన్నారు. కరోనా ప్రభావం గుండె, ఊపిరితిత్తుల పై పడి ఎక్కువమంది మరనిస్తున్నారని, కానీ ఆ మరణాలను కూడా సాధారణ మరణాలుగా చూపుతున్నారని వెంకట్‌ ఆరోపించారు. సాధారణ మరణం అని చెప్పి కోవిడ్‌ నిబంధనల ప్రకరాం దహన సంస్కారాలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఇదే జరుగుతోందని అన్నారు. పలు హాస్పిటల్స్ ఇచ్చిన మరణ ధ్రువీకరణ పత్రాల ఆధారాలను చూపిస్తున్నా కరోనా నివారణకు చర్యలు తీసుకోకుండా లెక్కలు తగ్గిస్తే పరిస్థితి దారుణమయ్యే అవకాశం ఉందని, రాష్ట్రం శ్మశానం అవుతుంది అని వెంకట్‌ హెచ్చరించారు.