కేటీఆర్ వాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి: బల్మూర్ వెంకట్

 కేటీఆర్ వాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి: బల్మూర్ వెంకట్

టీఎస్పీఎస్సీ(TSPSC) పేపర్ లీకేజ్ కేసును తెలంగాణ హైకోర్టు మార్చి 21 మంగళవారానికి వాయిదా వేసింది. పేపర్ లీకేజ్ కేసులో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి పాత్రపై దర్యాప్తు జరిపించాలని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు NSUI తెలంగాణ అధ్యక్షుడు బల్మూర్ వెంకట్. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ దర్యాప్తు జరిపించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. బల్మూర్ వెంకట్ తో పాటు మరో ఇద్దరు అభ్యర్థులు పిటిషన్ వేశారు. గ్రూప్ 1 పేపర్ లో ఒకే జిల్లాకు చెందిన 20 మందికి అధిక మార్కులు రావడం అనుమానంగా ఉందని బల్మూర్ వెంకట్ పేర్కొన్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ మీడియా సమావేశంలో చేసిన వాఖ్యలు కూడా అనుమానాలకు తావిస్తున్నాయన్నారు.

పేపర్ లీకేజీ వ్యవహారంలో ఇద్దరి పాత్ర మాత్రమే ఉందన్న కేటీఆర్ వాఖ్యలు విచారణను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని బల్మూర్ వెంకట్ తెలిపారు. సిట్ దర్యాప్తును ప్రభుత్వం ప్రభావితం చేస్తుందనే అనుమానాలు ఉన్నాయన్నారు. కాగా, మార్చి 21న మంగళవారం పిటిషన్ తరపు వాదనలు వినిపించునున్నారు నేషనల్ కాంగ్రెస్ లీగల్ సెల్ ప్రసిడెంట్ వివేక్ ధన్కా. తెలంగాణ హైకోర్టు ఈ పిటిషన్ పై మార్చి 21న విచారణ జరుపనుంది.