
పద్మారావునగర్, వెలుగు: బన్సీలాల్ పేటకు చెందిన సపోర్ట్యాక్టర్ కుర్మశంకర్ కు ఎన్టీఆర్ టాలీవుడ్ అవార్డు దక్కింది. ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి 75 మంది తెలుగు యాక్టర్లకు ఎన్టీఆర్ టాలీవుడ్ అవార్డులను లయన్స్ డాక్టర్రంజిత్ కుమార్ ప్రకటించారు. త్యాగరాయ గాన సభలో జరిగిన కార్యక్రమంలో బెస్ట్ విలన్ కేటగిరీలో కుర్మశంకర్ కు ఈ అవార్డు ప్రదానం చేశారు.
కుర్మశంకర్ కొన్నేండ్లుగా తెలుగు సినిమాల్లో సపోర్ట్ క్యారెక్టర్లు చేస్తున్నారు. నిజం, యోగి, స్టాలిన్, పుష్ప-2 సినిమాల్లో నటించారు. కార్యక్రమంలో సినీ హీరో పృథ్వీరాజ్, రంజిత్, ప్రణయ్, గుర్రం విజయ్, పవన్ పాల్గొన్నారు.