గోదావరి–కావేరి లింకింగ్.. ఇచ్చంపల్లి నుంచే : ఎన్​డబ్ల్యూడీఏ

గోదావరి–కావేరి లింకింగ్.. ఇచ్చంపల్లి నుంచే : ఎన్​డబ్ల్యూడీఏ

హైదరాబాద్, వెలుగు: ఇచ్చంపల్లి నుంచే గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి రివర్​ లింకింగ్ ​ప్రాజెక్టు చేపట్టాలని నేషనల్​వాటర్ ​డెవలప్​మెంట్ ​అథారిటీ (ఎన్​డబ్ల్యూడీఏ) నిర్ణయించింది. నవంబర్​3న హైదరాబాద్​లో ఎన్​డబ్ల్యూడీఏ డీజీ భోపాల్​సింగ్ అధ్యక్షతన నిర్వహించే స్టాండింగ్​ కమిటీ ఐదో సమావేశం, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు రివర్​లింకింగ్​టాస్క్​ఫోర్స్​కమిటీ చైర్మన్​వెదిరె శ్రీరామ్​అధ్యక్షతన నిర్వహించే టాస్క్​ఫోర్స్​కమిటీ సమావేశంలో ఈ ప్రదిపాదనపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో మెమొరాండం ఆఫ్​అండర్​స్టాండింగ్​(ఎంవోయూ) డ్రాఫ్ట్​కాపీలను సభ్య రాష్ట్రాలకు అందజేయనున్నారు.

నాలుగో స్టాండింగ్​కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి, అక్కడి నుంచి గోదావరి నీటిని తరలించాలని ప్రతిపాదించారు. చత్తీస్ గఢ్​వినియోగించుకోకుండా మిగిలిన 151 టీఎంసీలను ఈ రివర్​లింకింగ్​ప్రాజెక్టులో భాగంగా తరలించనున్నారు. గతంలో 141 టీఎంసీలు మాత్రమే తరలిస్తామని ప్రతిపాదించగా, ఇప్పుడు ఇంకో పది టీఎంసీలు చేర్చారు.

అయితే తమ రాష్ట్రం వాటా నీటిని గోదావరి–కావేరి అనుసంధానానికి ఉపయోగించుకోవడాన్ని చత్తీస్​గఢ్​తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ రాష్ట్రం ఎంవోయూపై సంతాకం చేస్తే తప్ప ఈ ప్రాజెక్టు ముందుట పడే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో చత్తీస్​గఢ్​రాష్ట్రాన్ని ఒప్పించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.