
- ఎమ్మెల్యే ఆది నారాయణ
చంద్రుగొండ, వెలుగు: చంద్రుగొండ మండలంలోని బెండాలపాడులో మౌలిక వసతుల కల్పనకు ఆఫీసర్లు కృషి చేయాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పేర్కొన్నారు. బెండాలపాడులో కలెక్టర్జితేశ్ వి. పాటిల్ తో కలిసి ఆయన మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆఫీసర్లతో నిర్వహించిన మీటింగ్ లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లకు కలర్స్ వేయించాలన్నారు.
లోగోను ఇందిరమ్మ ఇండ్లపై వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. గృహ ప్రవేశాల సందర్భంగా ఏర్పాటు చేయనున్న పైలాన్ను సుందరంగా నిర్మించాలన్నారు. ప్రోగ్రాంలో అడిషనల్కలెక్టర్డి.వేణుగోపాల్, హౌసింగ్ సీఈ చైతన్య కుమార్, ఆర్డీఓ మధు, హౌసింగ్పీడీ రవీంద్రనాథ్, తహసీల్దార్ సంధ్యారాణి, టీపీసీసీ జనరల్సెక్రటరీ నాగ సీతారాములు, కాంగ్రెస్ నేతలు కోనేరు సత్యనారాయణ, భోజ్యా నాయక్, సురేశ్ పాల్గొన్నారు.