ఒడిశాలో లాక్‌డౌన్‌ జూన్‌ 1 వరకు పొడిగింపు

ఒడిశాలో లాక్‌డౌన్‌ జూన్‌ 1 వరకు పొడిగింపు

ఒడిశాలో లాక్‌డౌన్‌ను జూన్‌ 1 వరకు పొడిగిస్తున్నట్లు   ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో మే 5న రెండు వారాల లాక్‌డౌన్‌ను సీఎం నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం ప్రకటించింది. మే 19కి లాక్ డౌన్ గడువు పూర్తి కానుంది. ఈ క్రమంలో మళ్లీ లాక్‌డౌన్‌ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనలను వచ్చే నెల జూన్ 1 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ సమయంలో నిత్యావసర సరుకు షాపులతో పాటు..వ్యాక్సినేషన్‌ సెంటర్లు తెరచుకోనున్నాయని చెప్పింది. బ్యాంకు సేవలు కూడా అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది ఒడిశా ప్రభుత్వం.