న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్లో విదేశీ పెట్టుబడుల విషయంపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఓనర్షిప్ రిజిస్టర్లను డిజిటలైజ్ చేయడం మేలని, వివిధ దేశాలు ఆ సమాచారాన్ని పరస్పరం అందించుకోవడం అవసరమని ఓఈసీడీ రిపోర్టు వెల్లడించింది. ఈ సమాచారం సంబంధిత ప్రభుత్వ ఏజన్సీలకు రియల్–టైములో అందుబాటులో ఉండేలా చొరవ తీసుకోవాలని ఈ రిపోర్టులో సూచించింది.
రియల్ ఎస్టేట్పై ఫోకస్తో ఇంటర్నేషనల్ ట్యాక్స్ ట్రాన్స్పరన్సీ పెంపుదల అనే అంశంపై ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనమిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) ఒక రిపోర్టును తీసుకొచ్చింది. పన్నులు చెల్లించకుండా ఉండేందుకు ఫైనాన్షియల్ ఎసెట్స్లోని పెట్టుబడులను విదేశీ రియల్ ఎస్టేట్లోకి మళ్లించడం గత పదేళ్లలో ఎక్కువైందని రిపోర్టులో స్పష్టం చేసింది. క్రాస్ బోర్డర్ రియల్ ఎస్టేట్ఇన్వెస్ట్మెంట్లపై పూర్తి సమాచారం పన్ను అథారిటీలకు ఉండదని పేర్కొంది. గత పదేళ్లలో విదేశీయుల రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెరిగినట్లు సంకేతాలున్నాయని వివరించింది.
ఏదైనా ఒక దేశంలో మరో దేశానికి చెందిన వ్యక్తులు లేదా సంస్థలు పెట్టే రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో ట్యాక్స్ కంప్లయన్స్ రిస్క్లు కూడా పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో ఓఈసీడీ రిపోర్టు తెలిపింది. జీ 20 దేశాల సమావేశం సందర్భంగా తాజా రిపోర్టును తీసుకొచ్చారు. ఇప్పటికే ఆపరేషనల్గా ఉన్న గేట్వేస్ ద్వారానే మొదట్లో వివిధ దేశాలు తక్కువ ఖర్చుతోనే తమ సమాచారాన్ని పంచుకోవచ్చని రిపోర్టు సూచించింది.
తర్వాత దశలో యాంటీ–మనీలాండరింగ్ ఫ్రేమ్వర్క్ కింద డిజిటలైజ్డ్ ఓనర్షిప్ రిజిస్టర్స్ను రూపొందించి, ఒక దేశం మరో దేశానికి అందించుకోవచ్చని పేర్కొంది. రియల్ ఎస్టేట్లో విదేశీ ఓనర్షిప్ అనే అంశంపై ఒక రిపోర్టు తీసుకు రావాల్సిందిగా జీ 20 ప్రెసిడెంట్గా ఉన్న ఇండియా కోరినట్లు ఓఈసీడీ వెల్లడించింది