హైదరాబాద్, వెలుగు: మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ చెయిన్ లాట్మొబైల్ తన 11వ బర్త్ డే సందర్భంగా పలు ఆఫర్లను ప్రకటించింది. రూ.నాలుగు వేల విలువైన ఎయిర్పాడ్స్ లేదా వైర్లెస్ బ్లూటూత్ హెడ్సెట్ను రూ.11లకే అమ్ముతారు. ప్రతి స్మార్ట్ఫోన్, స్మార్ట్టీవీ, ఏసీ వంటి ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్ కొనుగోలుపై రూ.2,500 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్తోపాటు కచ్చితమైన బహుమతి ఉంటుంది.
స్మార్ట్టీవీల ధరలు రూ.8,499 నుంచి మొదలవుతాయి. వీటిపైనా భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. బ్రాండెడ్ లాప్ట్యాప్స్ధరలు రూ.16,500 నుంచి మొదలవుతాయి. వీటిపై 7.5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. శామ్సంగ్ ఫ్లిప్, ఫోల్డ్ ఫోన్లపై రూ.30 వేల విలువైన ప్రయోజనాలు పొందవచ్చు. యాపిల్ ప్రొడక్టులపై రూ.7,500 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. వివో, ఒప్పో మొబైల్స్కొంటే రూ.10 వేల వరకు క్యాష్బ్యాక్ ఇస్తారు.
వన్ప్లస్, ఎంఐ, రియల్మీ మొబైల్స్పై రూ.ఐదు వేల వరకు ఇన్స్టంట్ క్యాష్బ్యాక్ దక్కించుకోవచ్చు. పేటీఎం, మొబిక్విక్ వాలెట్స్తో కొంటే ఐదు శాతం డిస్కౌంట్ఇస్తారు. స్మార్ట్గాడ్జెట్స్పై ఐదు శాతం డిస్కౌంట్ దక్కించుకోవచ్చు. రూపాయి డౌన్పేమెంట్తో ఫోన్లు, లాప్టాప్లు, స్మార్ట్టీవీలు కొనుక్కోవచ్చు. స్మార్ట్ వాచీలు, మొబైల్ యాక్సెసరీలు, స్క్రీన్గార్డ్స్, సౌండ్ వూఫర్స్, సౌండ్ బార్స్, ఇన్వర్టర్స్, ప్రింటర్స్, నెక్ బ్యాండ్స్పై చాలా ఆఫర్లు ఉన్నాయని లాట్మొబైల్స్ డైరెక్టర్లు అఖిల్, సుప్రజ వివరించారు.