సంతకాలు లేకుండా  చెక్కులిచ్చిన ఆఫీసర్లు

 సంతకాలు లేకుండా  చెక్కులిచ్చిన ఆఫీసర్లు

హుజూర్‌నగర్, వెలుగు: హుజూర్‌నగర్  పట్టణంలో శుక్రవారం జారీ చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు చెల్లలేదు. ఎమ్మెల్యే సైదిరెడ్డి  ఈ నెల 18న 104 మందికి చెక్కులు పంపిణీ చేశారు. అందులో సుమారు 80 చెక్కులపై బ్యాంకు మేనేజర్ సంతకాలు లేవు. ఆఫీసర్లు ఈ విషయాన్ని గుర్తించకుండానే లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. శనివారం లబ్ధిదారులు బ్యాంకుకు వెళ్లగా సిబ్బంది ఆ చెక్కులు చెల్లవని చెప్పారు. దీంతో తహసీల్దార్ వద్దకు వచ్చి విషయాన్ని చెప్పారు. హుజూర్ నగర్ తహసీల్దార్ జయశ్రీ కోదాడ ఆర్డీవో ఆఫీస్ సిబ్బందితో మాట్లాడి జరిగిన పొరపాటును వివరించారు. దీంతో ఆర్డీవో సిబ్బంది బ్యాంకు ఆఫీసర్లతో మాట్లాడి చెక్కులపై తిరిగి సంతకాలు చేయించారు.