గూడూరు/ మొగుళ్లపల్లి/ పర్వతగిరి (సంగెం)/ ఎల్కతుర్తి/ భీమదేవరపల్లి, వెలుగు: మొదటి విడత నామినేషన్ కేంద్రాలను చివరి రోజైన శనివారం పలువురు ఆఫీసర్లు తనిఖీ చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లోని కేంద్రాలను ఎన్నికల అబ్జర్వర్ మధుకర్ బాబు తనిఖీ చేసి, ప్రక్రియను పరిశీలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంతోపాటు రంగాపురంలోని కేంద్రాలను ఆ జిల్లా ఎలక్షన్ అబ్జర్వర్ ఫణీందర్రెడ్డి పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని పలు క్లస్టర్లలో చేపట్టిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. సంగెం మండలంలో తహసీల్దార్ రాజ్కుమార్ 8 క్లస్టర్లను పరిశీలించగా, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు శివకుమార్ నాయుడు సందర్శించి అధికారులతో మాట్లాడారు. కేంద్రం ఏర్పాట్లపై ఆరా తీశారు.
