అనకాపల్లిలో భారీగా గంజాయి స్వాధీనం

అనకాపల్లిలో భారీగా గంజాయి స్వాధీనం

గంజాయి అక్రమ రవాణాకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ఎప్పటికప్పుడు పోలీసులు నిఘా పెట్టి కొరడా ఝులిపిస్తున్నా...అక్రమార్కులు మాత్రం కొత్త ఎత్తుగడలు వేస్తూ అక్రమ రవాణా చేస్తున్నారు.  అనకాపల్లి నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ఓ డీసీఎం వ్యానులో భారీగా గంజాయి పట్టబడింది. గోనె సంచుల మాటున గంజాయి తరలిస్తున్న డీసీఎం వ్యాన్ అదుపుతప్పి  రోడ్డు పక్కకు దూసుకుపోయింది. అందులో తెల్లటి సంచులు బయటపడటంతో స్థానికులు గమనించి పోలీసులుకు సమాచారం అందించారు. అందులో  దాదాపు 1169 కేజీలకుపైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దీని విలువ మార్కెట్ లో రూ.2.33 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. క్రేన్ సాయంతో డీసీఎంను బయటకు తీశారు. అందులో తనిఖీలు చేయగా విస్తుపోయే విధంగా గంజాయి దొరికింది. డీసీఎం డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు పోలీసులు. 

మరిన్ని వార్తల కోసం

నియంత పాలనకు వ్యతిరేకంగానే పోరాటం

తేజ్ బహదూర్ జయంతి వేడుకల్లో పాల్గొననున్న మోడీ