హీరోగానే కాక నిర్మాతగానూ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు సూర్య. తాజాగా ఆయన మరో కొత్త సినిమాకు కమిట్ అయినట్టు తెలుస్తోంది. కోర్డు రూమ్ డ్రామా ‘జై భీమ్’తో సూపర్ హిట్ను అందుకున్న సూర్య, ఆ చిత్ర దర్శకుడు టి.జె.జ్ఞానవేల్తో మరో సినిమా చేయబోతున్నాడు. ఇటీవల ఓ కార్యక్రమంలో సూర్య ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. ప్రస్తుతం బాల దర్శకత్వంలో నటిస్తున్నాడు సూర్య. తన కెరీర్లో ఇది 41వ చిత్రం. కొన్ని వారాల క్రితం కన్యాకుమారిలో ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. నెక్స్ట్ షెడ్యూల్ను త్వరలో గోవాలో షూట్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత వెట్రిమారన్ డైరెక్ట్ చేయబోయే ‘వాడివాసల్’ చిత్రంలో నటించాల్సి ఉంది. అయితే విజయ్ సేతుపతితో వెట్రిమారన్ తీస్తున్న ‘విడుదలై’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదు. ఆ తర్వాత ప్రమోషన్, రిలీజ్కు టైమ్ పడుతుంది. దీంతో బాల సినిమా పూర్తవగానే జ్ఞానవేల్ సినిమాని పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట సూర్య. ఇక జూన్ 3న విడుదలవుతున్న కమల్ హాసన్ సినిమా ‘విక్రమ్’లో గెస్ట్ రోల్లో కనిపించబోతున్నాడు సూర్య.