
గండిపేట, వెలుగు: ఒక వైపు ప్రభుత్వం చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడాలని సూచిస్తుంటే కొందరు అధికారులు అనాలోచిత నిర్ణయాలతో వందల ఏండ్ల నాటి చెట్లను నరికివేస్తున్నారు.
బండ్లగూడ జాగీరు పరిధిలోని హిమాయత్సాగర్లో లార్డ్స్ ఇంజినీరింగ్ కాలేజీకి వెళ్లే దారిలో కరెంట్ కేబుల్స్కు అడ్డంగా ఉందని భారీ చెట్టును విద్యుత్ అధికారులు నరికి వేశారు. పర్యావరణ ప్రేమికులు అధికారులను ప్రశ్నించినప్పటికీ వారు పట్టించుకోకుండా చెట్లు నరికి వేశారు.