కరీంనగర్ ప్రజావాణిలో అధికారుల కాలక్షేపం

కరీంనగర్ ప్రజావాణిలో అధికారుల కాలక్షేపం

ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కలెక్టర్​ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజావాణికి హాజరయ్యే అధికారులు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు. సోమవారం కరీంనగర్​ కలెక్టరేట్​లో జరిగిన ప్రజావాణిలో పలువురు అధికారులు సెల్ ఫోన్​లో వీడియోలు చూస్తూ, చాటింగులు చేస్తూ, హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ కాలక్షేపం చేశారు.

 అధికారుల తీరుపై గతంలో అడిషనల్ కలెక్టర్ అసహనం వ్యక్తం చేసినా వారి తీరు మారడంలేదు. ఈ నిర్లక్షంపై కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.                    - వెలుగు ఫొటోగ్రాఫర్ కరీంనగర్