రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు

రాష్ట్రంలో  కొత్త ప్రాజెక్టులు

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ స్టేట్​ఇరిగేషన్​ డెవలప్​మెంట్​కార్పొరేషన్(ఐడీసీ)​ పరిధిలో కొత్తగా 35 లిఫ్ట్​ స్కీములకు అధికారులు ప్రపోజల్స్​సిద్ధం చేశారు. శుక్రవారం ఐడీసీ ఆఫీసులో చైర్మన్​ వేణుగోపాలాచారి అధ్యక్షతన బోర్డు మీటింగ్ నిర్వహించారు. కొత్తగా చేపట్టనున్న ప్రాజెక్టులపై చర్చించారు. ఎత్తయిన ప్రాంతాలకు నీటిని అందించడానికి మరికొన్ని లిఫ్టుల నిర్మానం కోసం ప్రపోజల్స్​ వచ్చాయని,  వాటిని సీఎం కేసీఆర్​దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపడతామని వేణుగోపాలాచారి వెల్లడించారు.

2022 – 23 ఆర్థిక సంవత్సరానికిగాను ఐడీసీకి రూ.269.54 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. అందులో భాగంగా చేపట్టిన 538 లిఫ్ట్​స్కీములతో 4.69 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతోందని వివరించారు. రూ.743.19 కోట్లతో చేపట్టిన ఇంకో 37 స్కీములు పనులు కొనసాగుతున్నాయని..అవి పూర్తయితే ఇంకో 65 వేల ఎకరాలకు నీరు అందుతుందని తెలిపారు. సమావేశంలో ఇరిగేషన్​స్పెషల్​సీఎస్​రజత్​కుమార్, ఈఎన్సీ (ఓ అండ్​ఎం) నాగేందర్​రావు, గ్రౌండ్ ​వాటర్ ​డిపార్ట్​మెంట్ ​డైరెక్టర్​పండిట్​మడ్నూరే, ఐడీసీ ఎండీ విద్యాసాగర్, బోర్డు మెంబర్లు లత, వినోద్ పాల్గొన్నారు.