- మల్లన్నసాగర్ నిర్వాసితులను ఖాళీ చేయించిన ఆఫీసర్లు
గజ్వేల్, వెలుగు: సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని డబుల్ ఇండ్లలో తాత్కాలికంగా ఉంటున్న మల్లన్నసాగర్ నిర్వాసితులను అధికారులు ఖాళీ చేయించి, లబ్ధిదారులకు అందజేశారు. శుక్రవారం రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ అధికారులు గజ్వేల్- ప్రజ్ఞాపూర్ డబుల్ బెడ్రూం కాలనీలో 15 ఇండ్లను ఖాళీ చేయించారు. వాటిని గతంలో లాటరీ ద్వారా కేటాయించిన లబ్ధిదారులకు అందజేశారు. ఇలా ఇప్పటి వరకు 49 మందికి అందజేసినట్లు ఆర్ఐజి కృష్ణ తెలిపారు.
మల్లన్న సాగర్ ముంపు నిర్వాసితులను తరలించే సమయంలో ఇండ్ల ప్యాకేజీ తీసుకోని వారికి తాత్కాలికంగా ఇక్కడ ఇండ్లను కేటాయించారు. వీరికి ఇంటి స్థలాలు ఇవ్వడంతో వారు ఇండ్లు నిర్మించుకొని వెళ్లిపోయినప్పటికీ, ‘డబుల్’ఇండ్లను ఖాళీ చేయకుండా తాళాలు వేసుకున్నారు. ప్రస్తుతం అలాంటి ఇండ్లను గుర్తించి అధికారులు ఖాళీ చేయించి లబ్ధిదారులకు అందిస్తున్నారు. 255 ఇండ్లను ఖాళీ చేయించాల్సి ఉందని అధికారులు తెలిపారు.
