టెహ్రాన్: గల్ఫ్ఆఫ్ఒమన్లో ఓ విదేశీ చమురు ట్యాంకర్ను ఇరాన్అధికారులు శుక్రవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. అందులోని 18 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో 6 మిలియన్ లీటర్ల అక్రమ ఇంధనం ఉందని ఇరాన్ మీడియా సంస్థలు తెలిపాయి. ఇరాన్ అదుపులోకి తీసుకున్న సిబ్బందిలో ట్యాంకర్ కెప్టెన్తో పాటు భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్కు చెందినవారు ఉన్నారని వెల్లడించాయి.
ఇరాన్ జలాల్లోని పోర్ట్సిటీ జాస్క్ వద్ద ట్యాంకర్ను అడ్డగించి తనిఖీ చేసిన తర్వాత స్వాధీనం చేసుకున్నట్లు అక్కడి న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఆ ట్యాంకర్.. ఇరాన్అధికారుల ఆదేశాలను పట్టించుకోకపోవడం, పారిపోయేందుకు ప్రయత్నం చేయడం, నావిగేషన్, కార్గో డాక్యుమెంటేషన్ లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది.
=============================================================
=============================================================
