
సాయిరామ్ శంకర్, శృతీ సోధి, అశీమా నర్వాల్ హీరో హీరోయిన్లుగా వినోద్ విజయన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. వినోద్ విజయన్, గార్లపాటి రమేష్ నిర్మించారు. ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా వినోద్ విజయన్ మాట్లాడుతూ ‘ఇదొక థ్రిల్లర్ మూవీ.
ఇందులో సాయిరామ్ శంకర్ పవర్ ఫుల్ అడ్వకేట్ పాత్రలో కనిపిస్తారు. సముద్రఖని పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. గోపిసుందర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్గా నిలుస్తుంది’ అని చెప్పారు.