- జ్యోతిపై ట్వీట్ చేసినందుకు
జమ్మూకాశ్మీర్: యాక్సిడెంట్లో దెబ్బలు తగిలి, లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన తండ్రిని సైకిల్పై తీసుకొచ్చిన బీహార్ బాలికను ప్రశంసిస్తూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ చేసిన ట్వీట్పై జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఫైర్ అయ్యారు. పేదరికంతో నిరాస, నిస్పృహలతో కూరుపోయిన జ్యోతి 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కడాన్ని థ్రిల్ కోసం చేసినట్లు అభివర్ణించడం ఏంటి అని ప్రశ్నించారు. ప్రభుత్వం జ్యోతిని ఓడించిందని ఫైర్ అయ్యారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం కూడా ట్వీట్ చేశారు. “ ఇది ఫుట్ ఆఫ్ ఎక్స్లెన్స్ కాదు. బీజేపీ సర్కార్ కఠినమైన వైఖరి. నిరాశకు ఆజ్యం పోసింది” అని కార్తీ చిదంబరం ట్వీట్ చేశారు. తండ్రిని 1200 కి.మీ. సైకిల్పై తెచ్చినందుకు జ్యోతిని పొగుడుతూ ఇవాంక ట్రంప్ ట్వీట్ చేశారు. ఎంతో ఓర్పుతో అద్భుతమైన, ప్రేమపూర్వకమైన సాహనం చేసిందని కొనియాడారు. జ్యోతి సాహసాన్ని గుర్తించిన సైక్లింగ్ సమాఖ్య ఆమెను ట్రయల్స్ నిర్వహించేందుకు ముందుకొచ్చింది. మరోవైపు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆమెకు ఆర్థిక సాయం కూడా ప్రకటించారు.