
తమిళ నటుడే అయినా.. పలు తెలుగు చిత్రాల్లో నటించి ఇక్కడా మంచి పేరు తెచ్చుకున్నాడు బాబీ సింహా. ఆయన హీరోగా నటించిన ‘వసంత కోకిల’ చిత్రం ఇప్పుడు ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అయ్యింది. కొత్త దర్శకుడు రమణన్ పురుషోత్తమ్ రూపొందించాడు. ‘నర్తనశాల’ ఫేమ్ కాశ్మీర పరదేశీ హీరోయిన్. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్, ముద్ర ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లపై రజనీ తాళ్లూరి, రేష్మి సింహా కలిసి నిర్మించారు.
రెండేళ్ల క్రితమే విడుదలవ్వాల్సిన ఈ చిత్రం పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మధ్యలో ఓటీటీలో వస్తుందనే ప్రచారమూ జరిగింది. దీంతో శుక్రవారం ఫైనల్ రిలీజ్ డేట్ని అనౌన్స్ చేశారు మేకర్స్. ఫిబ్రవరి 10న తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో థియేటర్స్లో ఈ సినిమా రిలీజ్ అవుతున్నట్టు ప్రకటించారు.