మరోసారి భూముల వేలానికి నోటిఫికేషన్

మరోసారి భూముల వేలానికి నోటిఫికేషన్

మరోసారి భూముల వేలానికి హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని మేడ్చల్ జిల్లా బహదూర్ పల్లి, రంగారెడ్డి జిల్లా తొర్రుర్, తుర్కయాంజల్ లేఅవుట్లలోని ప్లాట్లను అమ్మకానికి పెట్టినట్లు ప్రకటించింది. బహదూర్ పల్లిలో 51 ప్లాట్లు, తొర్రుర్ లో 148 ప్లాట్లు, తుర్కయాంజల్ లో 34 ప్లాట్లకు వేలం వేయనున్నట్లు వెల్లడించింది. గతంలో అమ్ముడుపోని ప్లాట్లతో పాటు మరికొన్ని ప్లాట్లకు ఈసారి వేలం నిర్వహిస్తున్నామని హెచ్ఎండీఏ స్పష్టం చేసింది.వేలంలో పాల్గొనదల్చిన వారు జూన్ 28న సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది.వేలంలో పాల్గొనేవారు ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) చేయడానికి జూన్ 29 వరకు గడువు ఉందని పేర్కొంది. ప్లాట్లకు సంబంధించిన ఆన్ లైన్ వేలం జూన్ 30న ఉంటుందని తెలిపింది. బహదూర్ పల్లిలోని ప్లాట్లకు ఒక్కో గజానికి రూ.25వేలు, తొర్రుర్ లో గజానికి రూ.20వేల ధరను నిర్ధారించినట్లు హెచ్ఎండీఏ వివరించింది. తుర్క యాంజల్ లో 9.5 ఎకరాల్లో వేసిన లే అవుట్ లోని 34 ప్లాట్లను అమ్మకానికి పెట్టినట్లు పేర్కొంది. తుర్క యాంజల్ లో సగటున 600 నుంచి 1060 గజాల విస్తీర్ణంలో ప్లాట్లు ఉన్నాయని, గజం ధర రూ.40వేలు ఉందని తెలిపింది.  

మరిన్ని వార్తలు..

ట్రెండ్ సెట్టర్.. సూపర్ స్టార్ కృష్ణ 52 ఏళ్ల సినీ ప్రస్థానం

ముక్తినాథ్ కు బయలుదేరి.. అనంత లోకాలకు