ఢిల్లీలోని సాకేత్ కోర్టు ఆవరణలో అండర్ ట్రయల్ ఖైదీ హత్య

ఢిల్లీలోని సాకేత్ కోర్టు ఆవరణలో అండర్ ట్రయల్ ఖైదీ హత్య

ఢిల్లీలోని సాకేత్ కోర్టు లోపల లాకప్‌లో ఖైదీ హత్యతో తీవ్ర కలకలం రేగింది. సాకేత్ కోర్టు ఆవరణలో అమన్ అనే ఖైదీని మరో ఇద్దరు అండర్ ట్రయల్ ఖైదీలు హత్య చేశారు. ఇద్దరు నిందితులను తీహార్ జైలు నంబర్ 8లో ఉంచారు.విచారణ కోసం సాకేత్ కోర్టుకు తీసుకువస్తుండగా ఈ ఘటన జరిగినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఇద్దరు ఖైదీలను కోర్టు విచారణ కోసం సాకేత్ కోర్టుకు తీసుకువచ్చిన క్రమంలో ఈ ఘటన జరిగింది. జూన్ 5న సాకేత్ కోర్టు లాకప్‌లోని ఖార్జా నంబర్ 5లో దాడి జరిగిందని అని ఢిల్లీ పోలీసులు తెలిపారు. సంఘటన జరిగిన సమయంలో మృతిచెందిన అమన్‌తో పాటు చాలామంది అండర్ ట్రయల్ ఖైదీలు(UTPలు) లాకప్ లోపల ఉన్నారు. 

పాత కక్షలు ఉన్నాయని అనుమానం

ఇద్దరు అండర్ ట్రయల్ ఖైదీలు జితేందర్ ,జైదేవ్ మృతుడు అమన్ పై దాడి చేశారు. 2024లో జైలు వెలుపల ఉన్నప్పుడు జరిగిన దాడి సంఘటన కారణంగా జితేందర్ ,అమన్ మధ్య పాత శత్రుత్వం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఆ సంఘటనలో జితేందర్ ,అతని సోదరుడిపై అమన్ కత్తితో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయిన పోలీసులు తెలిపారుు. 

An inmate, Aman has been killed by two other inmates inside Saket Court lockup. They both were lodged in Tihar jail no 8 and were brought to Saket Court for court proceedings: Delhi Police

— ANI (@ANI) June 5, 2025