ఏపీలో  కరోనా స్వైర విహారం..

ఏపీలో  కరోనా స్వైర విహారం..
  • ఇవాళ కూడా 22వేల 399 కొత్త కేసులు.. 89 మంది మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా స్వైర విహారం చేస్తోంది. ఇవాళ కూడా 22 వేల 399 కొత్త కేసులు నమోదు కాగా.. 89 మంది కరోనా నుంచి కోలుకోలేక తుదిశ్వాస విడిచారు. గడచిన 24 గంటల వ్యవధిలో 96 వేల 446 మందికి వైద్య పరీక్షలు చేయగా వారిలో 22 వేల 399 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఇక కరోనా మరణాల్లో విశాఖపట్టణం, విజయనగరం జిల్లాల్లో అత్యధికంగా 11 మంది చొప్పున చనిపోయారు. చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో 9 మంది చొప్పున, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో 8 మంది చొప్పున, శ్రీకాకుళం జిల్లాలో ఏడుగురు, గుంటూరు జిల్లాలో ఆరుగురు, నెల్లూరులో ఐదుగురు, కడప, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున, అనంతపురం జిల్లాల్లో ముగ్గురు కరోనా నుంచి కోలుకోలేక కన్నుమూశారు. అయితే గడచిన 24 గంటల్లో 18 వేల 638 మంది పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులై ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.