నిజాంపేట, వెలుగు: మొబైల్ లో ఇన్ స్టాగ్రామ్ చూస్తూ ఉండగా వర్క్ ఫ్రామ్ హోమ్ అనే ఫేక్ జాబ్ లింక్ ను చూసి దానిపై క్లిక్ చేయగానే అకౌంట్ లో ఉన్న డబ్బులు పోయాయి. ఈ సంఘటన నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం జరిగింది. నిజాంపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండల కేంద్రానికి చెందిన తాడెం మౌనిక ఇంట్లో ఉండి ఇన్ స్టాగ్రామ్ చూసే క్రమంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే లింక్ ఆన్లైన్ లో వచ్చింది.
దాన్ని చూసి ఆమె ఆ లింక్ ను క్లిక్ చేయగానే తన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న రూ.45 వేలు సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. ఎవరు సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఎటువంటి లింక్ లను క్లిక్ చేయొద్దని నిజాంపేట ఎస్ ఐ రాజేష్ పేర్కొన్నారు.
