ఖైరతాబాద్, వెలుగు: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఏకపక్ష నిర్ణయంతో ఎన్నికలకు వెళ్లేది లేదని ప్రకటించడాన్ని తాము వ్యతి రేకిస్తున్నట్లు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో వారు మీడియాతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి కూతురుగా తండ్రిలా మాటపై నిలబడుతుందని నమ్మి, ఆమె వెంట వెళితే.. తమను నడిరోడ్డుపై నిలబెట్టిందని ఆవేదన వ్యక్తంచేశారు.
పార్టీలో చర్చించకుండా పోటీకి దూరంగా ఉండి, కాంగ్రెసుకు సపోర్టు చేద్దామంటే తాము అంగీకరించమని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో కో– ఆర్డినేటర్లు మహ్మద్ ఇబ్రహీం (షాద్నగర్), అయూబ్ఖాన్(మలక్పేట్),క్రిస్టియన్సెల్ పార్టీ అధ్యక్షుడు డేవిడ్ శాంతరాజ్,రామలింగారెడ్డి (గజ్వేల్), ఇ.వెంకటరెడ్డి ( జనగాం) తదితరులు పాల్గొని మాట్లాడారు.