
- డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ది డెఫ్ సంస్థ డిమాండ్
ముషీరాబాద్,వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ప్రభుత్వ శాఖల్లో 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ‘ది డెవలప్మెంట్ సొసైటీ ఫర్ డెఫ్’ సంస్థ డిమాండ్ చేసింది. మంగళవారం నల్లకుంటలో డెఫ్ సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు వల్లభనేని ప్రసాద్, వి. భారతి మాట్లాడుతూ.. దివ్యాంగ బంధు, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, బ్యాక్లాగ్ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ఇందుకు చీఫ్ సెక్రటరీని కలుస్తామని తెలిపారు.
గత శుక్రవారం సెక్రటేరియట్కు వెళ్తే అన్యాయంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆసరా పెన్షన్లు రూ.10 వేలకు పెంచాలని, స్వయం ఉపాధికి రూ. 5 లక్షలు ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేశారు. బోగస్ దివ్యాంగుల సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగాలు పొందిన వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.