టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘ఓరి దేవుడా’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన మిథిలా పాల్కర్ హీరోయిన్గా నటించింది. తమిళంలో సూపర్ హిట్టయిన ‘ఓమై కడువలే’ చిత్రానికి రీమేక్గా ఈ మూవీ తెరకెక్కింది. అశ్వత్ మరిముత్తు ఈ రీమేక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. స్నేహితులుగా ఉన్న హీరో హీరోయిన్లు పెళ్ళి చేసుకుంటారు.. అయితే పెళ్ళి తర్వాత కొన్నాళ్ళకే అపార్థాల కారణంగా వాళ్లు డైవర్స్ కోసం కోర్టు వెళ్తారు. అయితే వీళ్ళు విడిపోవడానికి కారణాలు ఏంటీ? వీళ్ళ సమస్యను దేవుడు ఎలా పరిష్కరించాడు? అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించనట్టు ట్రైలర్ చూస్తే అర్థమౌతుంది. ఇక ఈ చిత్రంలో దేవుడి పాత్రలో విక్టరీ వెంకటేష్ కనిపించనున్నాడు.
ట్రైలర్ చివర్లో వైఫ్లో ఫ్రెండ్ను చూడొచ్చు సార్.. కానీ ఫ్రెండ్ వైఫ్లా వచ్చిందనుకో అంటూ వెంకటేష్కు చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ట్రైలర్తోనే చిత్రబృందం సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేసింది. లియన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీవిపీ సినిమాస్, శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 21న విడుదల కానుంది.