
- జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని నిరంతరం పెంచుకోవాలి
- ఓయూ ప్రొఫెసర్ శ్రీరాములు
- కాకా అంబేడ్కర్ కాలేజీలో ఓరియంటేషన్ ప్రోగ్రాం
ముషీరాబాద్, వెలుగు: ఆధునిక ప్రపంచంలో పోటీ పడేందుకు విద్యార్థులందరూ తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను నిరంతరం పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఉస్మానియా యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ డి. శ్రీరాములు అన్నారు. బాగ్ లింగంపల్లిలోని కాకా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళాశాలలోని ఎంబీఏ 2023-–25 బ్యాచ్ నూతన విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ డి. శ్రీరాములు, కాకా ఇనిస్టిట్యూషన్స్ జాయింట్ సెక్రటరీ పీవీ రమణ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ డి . శ్రీరాములు ఓయూ అందించే పాఠ్యాంశాలను క్లుప్తంగా విద్యార్థులకు వివరించారు. బహుళ జాతి కంపెనీల్లో ఉద్యోగాలు పొందేందుకు కీలకమైన వివిధ నైపుణ్యాలు, జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి విద్యార్థులు చురుకుగా ఉండాలని సూచించారు. కాకా ఇనిస్టిట్యూషన్స్ డైరెక్టర్స్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.