మంత్రి కేటీఆర్ , ఎమ్మెల్సీ కవిత సన్నిహితులకే ఓఆర్ఆర్ లీజు దక్కిందని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఐఆర్ఎల్ కంపెనీ రూ. 7 వేల 272 కోట్లకు టెండర్ వేసింది. ప్రభుత్వం మాత్రం రూ. 7 వేల 380 కోట్లకు వస్తాయని చెప్పి్ంది. వేసిన బిడ్ కంటే ఐఆర్ఎల్ కంపెనీ ఎందుకు ఎక్కువ ఇస్తోందని ప్రశ్ని్ంచారు.
ఓఆర్ఆర్ కాంట్రాక్టు బిడ్ ను ఈ ఏడాది ఏప్రిల్ 11న తెరిచినట్టుగా రఘునందన్ రావు చెప్పారు. కానీ ఏప్రిల్ 27న ఈ విషయాన్ని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ మీడియాకు ప్రకటన విడుదల చేశారని ఆయన గుర్తు చేశారు. బిడ్ ఓపెన్ చేసిన 16 రోజుల తర్వాత ఈ విషయాన్ని ఎందుకు బయటపెట్టారని ప్రశ్నించారు.
ఓఆర్ఆర్ పై బేస్ ప్రైజ్ ను నిర్ణయించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిలైందని రఘునందన్ విమర్శించారు . కనీసం హెచ్ 1, హెచ్ 2, హెచ్ 2, హెచ్ 4 కంపెనీలు పిలిచి బేస్ ప్రైజ్ కు తక్కువగా బిడ్ కోడ్ చేసినందున టెండర్ ను క్యాన్సిల్ చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే బాగుండేదన్నారు. ఓఆర్ఆర్ పై ఏప్రిల్ మాసంలో సగటున రూ. 2 కోట్ల 2 లక్షల ఆదాయం వచ్చిందని చెప్పారు.