ఓయూ,వెలుగు : హోంగార్డు కుటుంబానికి ఓయూ పోలీసులు ఆర్థికసాయం అందించారు. ఎం.సుధాకర్ హోంగార్డు గా ఓయూ పీఎస్ లో చేస్తూ గత ఫిబ్రవరి 28న గుండెపోటుతో చనిపోయాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలతో పాటు వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు.
సుధాకర్ ఆకస్మిక మృతితో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఓయూ, నల్లకుంట ట్రాఫిక్ పోలీసులు విరాళాలు సేకరించి రూ.2.25లక్షల నగదును ఓయూ డివిజన్ ఏసీపీ జగన్చేత బుధవారం సుధాకర్ కుటుంబానికి అందజేశారు.