ఓయూ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉత్తమ సైంటిస్టుగా గుర్తింపు

ఓయూ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉత్తమ సైంటిస్టుగా గుర్తింపు
  • స్టాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ ప్రచురణ జాబితాలో చోటు  

ఓయూ, వెలుగు : కాలిఫోర్నియాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ప్రచురించిన ప్రపంచ ప్రముఖ శాస్త్రవేత్తల జాబితాలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్​కు చోటు దక్కింది.  ఓయూలోని జెనెటిక్స్ డిపార్ట్ మెంట్​లో అసిస్టెంట్ ప్రొఫెసర్  పీబీ కవి కిశోర్​కు ఈ గుర్తింపు లభించింది. సైటేషన్ కౌంట్, హెచ్ ఇండెక్స్, ఐటెన్ ఇండెక్స్ సహా 44  పరిశోధనా అంశాల ఆధారంగా ప్రపంచంలోని శాస్త్రవేత్తల్లో  టాప్ 2 శాతం జాబితాను స్టాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్డ్ యూనివర్సిటీ విడుదల చేసింది.  

జెనెటిక్స్ రంగంలో పరిశోధనలకుగాను కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గుర్తింపు లభించినందుకు వర్సిటీకి గర్వకారణమని పలువురు ప్రొఫెసర్లు హర్షం వ్యక్తం చేశారు. రవికిశోర్ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని వీసీ ప్రొఫెసర్​ రవీందర్​ఆకాంక్షించారు. గతంలోనూ కవి కిశోర్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులను దక్కించుకున్నారు.  ఓయూ నుంచి దాదాపు 300కు పైగా పరిశోధనా పత్రాలను ప్రచురించారు.