![భూసారం పెంపుపై ఓయూ సోషియాలజీ విద్యార్థుల రీసెర్చ్](https://static.v6velugu.com/uploads/2024/03/ou-sociology-students-research-on-soil-fertility_U2z31V4kEf.jpg)
ఓయూ, వెలుగు: రైతులు తమ భూముల్లో ఎలాంటి పంట వేయాలనే అవగాహన లేకపోవడంతోనే ఆశించిన మేర దిగుబడి రాక అప్పుల పాలు అవుతున్నారని ఓయూ సోషియాలజీ విభాగపరిశోధనా విద్యార్థి కత్తెరసాల శ్రీనివాస్ తెలిపారు. పంట భూములను కాపాడుకుని భవిష్యత్ తరాలకు అందించేందుకు ‘ సుస్థిర వ్యవసాయ రంగం’ చాలా అవసరమని పేర్కొన్నారు. తన పరిశోధనలో భాగంగా ఆయన ఆదివారం జనగామ జిల్లా కోలుకొండ గ్రామానికి వెళ్లి పలు రకాల వ్యవసాయ కమతాలను సందర్శించి రైతులతో చర్చించారు.