వీసీల సమావేశానికి రండి గవర్నర్కు ఆహ్వానం : వీసీ ప్రొ.కుమార్

వీసీల సమావేశానికి రండి  గవర్నర్కు ఆహ్వానం : వీసీ ప్రొ.కుమార్

ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలో ఫిబ్రవరి 19న జరగనున్న ఇండియన్ యూనివర్సిటీస్ అసోసియేషన్ సెంట్రల్ జోన్ వైస్ చాన్సలర్ల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను వీసీ ప్రొ.కుమార్ ఆహ్వానించారు. రాజ్‌భవన్​లో గవర్నర్​ను కలిసి బుధవారం ఆహ్వాన పత్రిక అందజేశారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశంలో ప్రారంభోత్సవ సమావేశానికి రావాలని కోరారు.