
- చందానగర్లో గజ దొంగ అరెస్ట్
చందానగర్, వెలుగు: జైలు నుంచి విడుదలైన 25 రోజుల్లో 8 దొంగతనాలకు పాల్పడిన ఓ గజ దొంగను చందానగర్ పోలీసులు అరెస్ట్చేశారు. అతని నుంచి రెండు బైకులు, 8 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. నారాయణపేట జిల్లా మరికల్మండలం జిన్నారం గ్రామానికి చెందిన ముద్దంగి భీమేశ్( 25) కూలీ పనులు పనిచేసేవాడు. పని చేయగా వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో దొంగతనాలు ప్రారంభించాడు. తాళం వేసిన ఇండ్లను గుర్తించి రాత్రి వేళ చోరీలకు పాల్పడ్డాడు. ఇంట్లోని నగలు, డబ్బుతోపాటు పార్కింగ్చేసిన బైక్లను ఎత్తుకెళ్తున్నాడు.
భీమేశ్2019 నుంచి ఇప్పటివరకు ఆరేండ్లలో 50కిపైగా దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 42 కేసుల్లో ఇప్పటికే జైలుకు కూడా వెళ్లాడు. సెప్టెంబర్ 23న సంగారెడ్డి జిల్లా కంది జైలు నుంచి విడుదలైన భీమేష్.. కేవలం 25 రోజుల్లో 8 దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇందులో చందానగర్పరిధిలో రెండు బైకులు, ఒక ఇంట్లో దొంగతనం, దుండిగల్లో ఒక ఇంట్లో దొంగతనం, మక్తల్లో ఒకే రోజుల రెండు ఇండ్లలో దొంగతనాలు, చైతన్యపురిలో ఒక దొంగతనం, హయత్నగర్లో ఒక బైక్ కొట్టేశాడు. ఈ 8 కేసుల్లో భీమేశ్ను అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు.