ఏడు పోస్టులు.. 500 మంది అభ్యర్థులు

ఏడు పోస్టులు.. 500 మంది అభ్యర్థులు

నిజామాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నడిచే బస్తీ దవాఖానాల్లో ఖాళీగా ఉన్న ఏడు పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా అభ్యర్థులు భారీగా తరలివచ్చారు.

4 మెడికల్​ ఆఫీసర్, ఒక స్టాఫ్​ నర్స్​, రెండు సపోర్టింగ్​ స్టాఫ్​ పోస్టుల కోసం గురువారం 500 మందికి పైగా అభ్యర్థులు కలెక్టరేట్​లోని జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయానికి  చేరుకొని దరఖాస్తులు అందజేశారు.  స్క్రుటినీ చేసి వివరాలను వెబ్​సైట్​లో ఉంచుతామని అధికారులు తెలిపారు.- వెలుగు, నిజామాబాద్ ఫొటోగ్రాఫర్