
రవిచంద్ర అశ్విన్ ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు సిరీస్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా సెకండ్ టెస్టులో 4 వికెట్లు, 42 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. టీమిండియాలో కూడా అశ్విన్(36) చాలా సీనియర్ ప్లేయర్ . ఇప్పటి వరకు అశ్విన్ టెస్టుల్లో 449 వికెట్లు, వన్డేల్లో 151 వికెట్లు, టీ20ల్లో72 వికెట్లు తీశాడు.
అయితే ఇటీవల బాగా రాణించకున్నా జట్టులో చోటు దక్కడంపై విమర్శలు ఉన్నాయి. అలాగే యువ స్పిన్నర్లను కాదని ఈ సీనియర్ స్పిన్నర్ ను తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తనను తాను అంచనా వేసుకోవడంలో కానీ..జట్టులో స్థానం దక్కడంపై కానీ అశ్విన్ అతిగా ఆలోచిస్తాడనే విమర్శలు ఉన్నాయి. ఈ విమర్శలు లేటెస్ట్ గా అశ్విన్ ట్విట్టర్లో ఘాటుగానే కౌంటర్ ఇచ్చాడు.
అతిగా ఆలోచించడమన్నది తనకు ఇండియా జెర్సీ వేసుకున్నప్పటి నుంచే ఉందన్నాడు అశ్విన్. ఈ విషయం ప్రమాదకరంగా మారుతుందని తెలుసుకోవడానికి తనకు 13 ఏళ్లు పట్టిందన్నారు. అయితే తాను అతిగా ఆలోచిస్తాడని బయట విమర్శలు వచ్చినప్పుడల్లా బాగా ఆలోచిస్తానని చెప్పాడు. తన ఆటపై తనకంటూ ఓ క్లారిటీ ఉందని..ఇలాగే ఆడాలని ఎవర్ని రికమండ్ చేయనని చెప్పాడు. తాను అతిగా ఆలోచిస్తాడనే పదం తొలగించడానికి తన పీఆర్ టీం సీరియస్ గా పనిచేయాలని సూచించారు. ఇప్పటికైనా తనను చూసి కొందరు యువకులు కొన్నేళ్ల తర్వాత నేర్చుకుంటారని ఆశిస్తున్నానని చెప్పాడు.