
న్యూఢిల్లీ: గ్లోబల్ ట్రావెల్ టెక్ సంస్థ ఓయో తన కంపెనీ- సర్వీస్డ్ హోటళ్లలో ఇన్-హౌస్ కిచెన్లు, క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు (క్యూఎస్ఆర్), ఫుడ్ అండ్ బేవరేజెస్(ఎఫ్అండ్బీ)లను అందించాలని భావిస్తున్నట్టు తెలిపింది. 'టౌన్ హౌస్ కేఫ్' బ్రాండ్ పేరుతో క్యూఎస్ఆర్లను నిర్వహించనుంది. 2025–-26 ఆర్థిక సంవత్సరంలో మొదటి దశలో 1,500 కంపెనీ -సర్వీస్డ్ హోటళ్లను మొదలుపెట్టనుంది. హోటళ్ల కస్టమర్లు "కిచెన్ సర్వీసెస్"ను ఎంచుకుంటే ఓయో యాప్ వెబ్సైట్, ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల ద్వారా, ఆన్లైన్ ట్రావెల్ ఏజెంట్ల ద్వారా భోజనాన్ని ఆర్డర్ చేయవచ్చు.
ఈ కొత్త వ్యాపారం వల్ల ఆదాయం 5–-10 శాతం పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది. ఓయో ప్రయోగాత్మకంగా ఈ సంవత్సరం జనవరి నుంచి ఢిల్లీ, గురుగ్రామ్, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లోని 100 కంపెనీ -సర్వీస్డ్ హోటళ్లను ప్రారంభించింది. మంచి ఫలితాలు రావడంతో రాబోయే ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా వీటిని ప్రారంభించాలని నిర్ణయించింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, పూణే, ఇండోర్, కోల్కతా, జైపూర్, లక్నో వంటి కీలక నగరాల్లో ఎఫ్ అండ్బీలను అందుబాటులోకి తెస్తామని ఓయో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వరుణ్ జైన్ అన్నారు.