న్యూఢిల్లీ: హాస్పిటాలిటీ కంపెనీ ఓయో తన సిబ్బందిని తగ్గించే పనిలో పడింది. దాదాపు 600 మంది ఉద్యోగులను తీసేస్తున్నట్లు తెలిపింది. సంస్థలో మొత్తం 3700 మంది పనిచేస్తున్నారు. అయితే కొత్తగా కొంతమందిని నియమించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రొడక్షన్, ఇంజనీరింగ్ టీమ్ల, ఓయో వెకేషన్ హోమ్స్ టీమ్ల సైజును తగ్గిస్తోంది. పార్ట్నర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, బిజినెస్ డెవెలప్మెంట్ టీమ్లలో ఉద్యోగుల సంఖ్యను పెంచుతోంది. పైలట్లను అభివృద్ధి చేస్తున్న టీమ్లలో కొందరిని ఇంటికి పంపిస్తోంది. యాప్ గేమింగ్, సోషల్ కంటెంట్ క్యూరేషన్, పాట్రన్ ఫెసిలిటేట్ కంటెంట్ టీమ్లలో కూడా సిబ్బందిని తగ్గిస్తోంది. 'పార్ట్నర్ సాస్' వంటి ప్రాజెక్ట్ల సభ్యులను తీసేస్తోంది లేదా కోర్ ప్రొడక్ట్, టెక్ ఏరియాల్లోకి మళ్లీ తీసుకుంటోంది.
కంపెనీ తన కార్పొరేట్ హెడ్క్వార్టర్లోనూ ఉద్యోగులను తీసేస్తోంది. సమానమైన హోదా ఉన్న ఉద్యోగుల్లో కొందరిని తొలగిస్తోంది. టీమ్లో సభ్యుల సంఖ్యను తగ్గిస్తోంది. రాజీనామాలు చేసిన వాళ్లు మరోచోటు ఉపాధి పొందేందుకు తాము చేయగలిగినదంతా చేస్తామమని ఓయో గ్రూప్ సీఈఓ రితేష్ అగర్వాల్ భరోసా ఇచ్చారు. కంపెనీకి విలువైన సహకారం అందించిన చాలా మంది ప్రతిభావంతులను వదులుకోవడం దురదృష్టకరమని కామెంట్ చేశారు. భవిష్యత్తులో వాళ్ల సేవలు అవసరమైతే అవకాశం కల్పిస్తామని అన్నారాయన. పార్ట్నర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ విభాగాన్ని బలోపేతం చేయడానికి 250 మందిని చేర్చుకోనున్నట్లు తెలిపారు.