ప్రజలపై పన్నుల భారం మోపటం బీజేపీకే చెల్లింది

ప్రజలపై పన్నుల భారం మోపటం బీజేపీకే చెల్లింది

1991 ఆర్థిక సంస్కరణలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ లీడర్  పి. చిదంబరం  స్పందించారు. సంస్కరణలను నిర్మల...  హాఫ్ బేక్డ్ అనటంపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేవుని దయ వల్ల డాక్టర్ మన్మోహన్ సింగ్  నోట్ల రద్దు, GST, పెట్రోల్, డీజిల్‌పై క్రూరమైన పన్నులు వండి వడ్డించలేదని అన్నారు. ప్రజలపై భారీగా పన్నుల భారాన్ని మోపటం బీజేపీకే చెల్లిందని చిదంబరం ట్వీట్ చేశారు

యూనివర్శిటీలో బేకరీ, వంట కోర్సులు తీసుకున్నట్లు వెల్లడించినందుకు ఆర్థిక శాఖ మంత్రికి తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామని చిదంబరం మరో ట్వీట్ చేశారు. గురువారం ముంబైలో జరిగిన బీజేపీ పార్టీ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ పీవీ  నరసింహారావు హయాంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన 1991 సంస్కరణలు అసంపూర్ణంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.