ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం : పీఏసీఎస్ వైస్ చైర్మన్ సోల్తి భూమాత రామస్వామి

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం  : పీఏసీఎస్ వైస్ చైర్మన్ సోల్తి భూమాత రామస్వామి

ఖిలావరంగల్​(మామునూర్)/  నల్లబెల్లి/ వెంకటాపూర్​(రామప్ప), వెలుగు: వడ్ల కొనుగోళ్లు ముమ్మరమయ్యాయి. సోమవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్, బొల్లికుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్​ వైస్ చైర్మన్ సోల్తి భూమాత రామస్వామి, కార్పొరేటర్ గద్దె బాబు ప్రారంభించారు. 

వరంగల్​ జిల్లా నల్లబెల్లి మండలం నాగరాజ్​పల్లిలో నర్సంపేట మార్కెట్​కమిటీ చైర్మన్​ పాల్వయి శ్రీనివాస్, ములుగు జిల్లా వెంకటాపూర్​​మండలం నర్సింగాపూర్​లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ములుగు వ్యవసాయ మార్కెట్​ కమిటీ వైస్​ చైర్మన్​ చేద సారంగపాణి కొనుగోళ్లను మొదలు పెట్టారు.