చిక్కిన టీఆర్​ఎఫ్​ కమాండర్​?

చిక్కిన టీఆర్​ఎఫ్​ కమాండర్​?

శ్రీనగర్​/న్యూఢిల్లీ: పహల్గామ్​ ఉగ్రదాడికి కారణమైనవారిని పట్టుకునేందుకు భద్రతాదళాలు జమ్మూకాశ్మీర్​లో భారీగా మోహరించాయి. దాడికి పాల్పడ్డ టెర్రరిస్టులు అక్కడి సమీప అటవీ ప్రాంతాల్లోనే  దాక్కొని ఉంటారని సెక్యూరిటీ ఫోర్స్​ భావిస్తున్నాయి. అన్ని ఏరియాలను క్షుణ్ణంగా చెక్​ చేస్తున్నాయి. 

కుల్గాం, పూంచ్​, కతువా వంటి ఏరియాల్లోనూ భారీగా తనిఖీలు కొనసాగుతున్నాయి. కుల్గాంలో సెక్యూరిటీ ఫోర్స్​కు, ఉగ్రవాదులకు మధ్య ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తున్నది. ఇందులో పహల్గాం ఉగ్రదాడికి కారణమైన ది రెసిస్టెన్స్​ ఫ్రంట్​ (టీఆర్​ఎఫ్​) కమాండర్​ చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉగ్రవాదుల సమాచారం అందిస్తే రూ.20 లక్షల రివార్డు ఇస్తామని జమ్మూకాశ్మీర్​ పోలీసులు ప్రకటించారు. కాగా, జమ్మూకాశ్మీర్​ పరిసరాల్లో దాదాపు 56 మంది  విదేశీ టెర్రరిస్టులు ఉన్నట్లు భద్రతా దళాలు పేర్కొన్నాయి.