ఢిల్లీలో పెయిడ్‌ క్వారంటైన్‌ ఫెసిలిటీ

ఢిల్లీలో పెయిడ్‌ క్వారంటైన్‌ ఫెసిలిటీ
  • మూడు హోటళ్లలో ఏర్పాటు
    రోజుకు రూ.3100 అద్దె

న్యూఢిల్లీ: ఢిల్లీలోని మూడు ప్రైవేట్‌ హోటల్స్‌లో అధికారులు పెయిడ్‌ క్వారంటైన్‌ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. సౌత్‌వెస్ట్‌ జిల్లాలో ఉన్న వెల్‌కమ్‌ హోటల్‌, వివాంటా బై తాజ్‌, పిక్కాడిలీ హోటల్‌లో వీటిని ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. ఈ హోటల్‌ రూమ్స్‌లో క్వారంటైన్‌లో ఉన్న వారు రోజుకు రూ.3100 చెల్లించాలని అన్నారు. పెయిడ్‌ క్వారంటైన్‌ కోసం 767 రూములను బుక్‌ చేశామని చెప్పారు. క్వారంటైన్‌లో ఉన్న వారికి ప్రత్యేక సదుపాయం ఏర్పాటు చేశామని, వారికి డిస్పోజబుల్‌ ప్లేట్లలో మీల్స్‌ అందిస్తున్నామన్నారు.