Virat Kohli: కోహ్లీ ఆటతీరుపై పాక్ మాజీ కెప్టెన్ జోస్యం

Virat Kohli: కోహ్లీ ఆటతీరుపై  పాక్ మాజీ కెప్టెన్ జోస్యం

భవిష్యత్తులో విరాట్ కోహ్లీ అత్యుత్తమంగా రాణిస్తాడని, మరొకసారి ప్రపంచం విరాట్ స్వర్ణయుగం చూడబోతోందని పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ జోస్యం చెప్పాడు. తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ.. ‘కోహ్లీ దశ తిరిగింది. అతన్ని ఎవరూ ఆపలేరు. శ్రీలంక మాజీ కెప్టెన్ సంగక్కర కెరీర్ లాగానే కోహ్లీ కెరీర్ ఉండబోతోంది. అతను ప్రస్తుతం స్వేచ్ఛగా ఆడుతున్నాడు. భవిష్యత్తులో అతని ఆటతీరు మరోసారి కనువిందు చేయనుంది. అయితే, పనిభారం మోయకుండా ఉండటానికి విరాట్ తనకు తగిన ఫార్మట్ ను ఎంచుకోవడం బెటర’ని అభిప్రాయపడ్డాడు.

పోయినేడాది ఆసియాకప్ తో తిరిగి ఫామ్ అందుకున్న విరాట్ కోహ్లీ ఏవిధంగా రాణిస్తున్నాడో తెలిసిందే. టీ20, వన్డేల్లో సెంచరీలమీద సెంచరీలు బాదేస్తున్నాడు. అయితే, టెస్టుల్లో విరాట్ సెంచరీ చేసి దాదాపుగా 1000 రోజులపైనే అయింది. ఫిబ్రవరి 9 నుంచి జరగబోయే ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ లో కోహ్లీ తన మార్క్ చూపించడం అవసరం.