పాక్ ముస్లిం మహిళకు భారత పౌరసత్వం

పాక్ ముస్లిం మహిళకు భారత పౌరసత్వం

జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ఆందోళనలతో చేస్తున్న ఈ సమయంలో ఓ పాకిస్తాన్ మహిళకు భారత పౌరసత్వం  లభించింది. ఆమె అభ్యర్థనతో భారత పౌరసత్వం మంజూరు చేసింది. గుజరాత్ లోని భాన్వాడ్ తాలూకాలో పుట్టి పెరిగిన మహిళ హసీనాబెన్.1999లో పాక్ కు చెందిన వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంది. ఆ తర్వాత ఆమె పాక్ పౌరసత్వం పొందింది. హసీనాబెన్ తన భర్త మరణించడంతో తిరిగి భారత్ కు రావాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం భారత పౌరసత్వం కోసం మన ప్రభుత్వానికి అభ్యర్థన చేసింది. ఆమె అభ్యర్థనను భారత ప్రభుత్వం అంగీకరించింది. ఈ నెల 18న ద్వారక జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా భారత పౌరసత్వ సర్టిఫికెట్ ను అందుకున్నారు హసీనాబెన్.