భారత్ లోకి ఆయుధాలు పంపేందుకు పాక్ కుట్ర..

భారత్ లోకి ఆయుధాలు పంపేందుకు పాక్ కుట్ర..

కశ్మీర్ లో అల్లర్లు సృష్టించేందుకు పాకిస్తానీ ఉగ్రవాదులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కిషన్ గంగా నది వెంబడి ఉగ్రవాదుల కదలికలను పసిగట్టింది ఆర్మీ. ట్యూబులలో ఆయుధాలు పెట్టి తాడు సాయంతో కిషన్ గంగా నది నుంచి భారత్ లోకి పంపేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టింది. టెర్రరిస్టులు పారిపోగా… ఆయుధాలను స్వాధీనం చేసుకుంది భారత సైన్యం. నాలుగు  AK 47 రైఫిల్స్, 8 మ్యాగజీన్లు, 240 రౌండ్ల బుల్లెట్లు ట్యూబ్ లో ఉన్నాయని గుర్తించారు. అయితే గతేడాదితో పోలిస్తే ఈ సారి ఉగ్రవాదుల చొరబాట్లు తగ్గాయంటున్నారు ఆర్మీ అధికారులు. గతేడాది 130వరకు చొరబాటు యత్నాలు జరగ్గా… ఈ సారి 30లోపే ఉన్నాయని చినార్ కాప్స్ కమాండర్ BS రాజు చెప్పారు. భారత్ లోకి ఆయుధాలు పంపి టెర్రరిస్టులకు అందించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందన్నారు. పాకిస్తాన్ లోని లాంచ్ పాడ్స్ లో 250 నుంచి 300 మంది వరకు ఉగ్రవాదులున్నారని ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు తెలిపాయన్నారు రాజు.