
ఇండియా, శ్రీలంక సంయక్తంగా ఆతిధ్యమిస్తున్న మహిళల వన్డే ప్రపంచ కప్ కి పాకిస్థాన్ స్క్వాడ్ వచ్చేసింది. సోమవారం (ఆగస్టు 25) 15 మందితో కూడిన మహిళా జట్టును పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఫాతిమా సనా జట్టుకు కెప్టెన్సీ చేయనుంది. 2024 లో యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్లో కెప్టెన్గా సనా తన తొలి ప్రధాన టోర్నమెంట్లో అద్భుతంగా రాణించడంతో ఆమెకే మరోసారి సారధ్య బాధ్యతలు అప్పగించారు. 20 ఏళ్ల అన్క్యాప్డ్ బ్యాట్స్మన్ ఈమాన్ ఫాతిమాను జట్టులోకి చేర్చింది.
ఈమాన్ ఒక్క వన్డే ఆడిన అనుభవం లేకపోయినా స్క్వాడ్ లోకి ఎంపిక చేయడం విశేషం. అయితే ఆమె మూడు అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు ఆడింది. వరల్డ్ కప్ కు ముందు పాకిస్థాన్ సెప్టెంబర్ 16 నుండి లాహోర్లోని గడాఫీ స్టేడియంలో సౌతాఫ్రికాతో మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. పాకిస్తాన్ వరల్డ్ కప్ మ్యాచ్ ల విషయానికి వస్తే ఏడు మ్యాచ్లను కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఆడనుంది. తొలి మ్యాచ్ అక్టోబర్ 2న ఆడనుంది.
పాకిస్తాన్ సెమీ-ఫైనల్, ఫైనల్కు చేరుకుంటే మ్యాచ్లు కొలంబోలోనే జరుగుతాయి. లేకపోతే గౌహతి, నవీ ముంబై తొలి సెమీ ఫైనల్స్ కు ఆతిధ్యమిస్తాయి. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనే ఈ టోర్నీ 2025, సెప్టెంబర్ 30 నుంచి 2025 నవంబర్ 2 వరకు జరగనుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న ఈ టోర్నీ ఐదు వేదికలలో హైబ్రిడ్ మోడ్లో జరగనుంది. భారత్లోని బెంగళూరు, గౌహతి, ఇండోర్, విశాఖపట్నం స్టేడియాల్లో మ్యాచులు జరగనున్నాయి.
ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ .. ఈ జట్లు వరల్డ్ కప్ కోసం పోటీ పడనున్నాయి. ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతోంది. సొంత దేశంలో టోర్నీ కావడంతో భారత్ హాట్ ఫేవరెట్. భారత్ చివరగా 2013లో ప్రపంచ్ కప్కు ఆతిథ్యం ఇవ్వగా.. ఈ టోర్నీలో ఇండియా ఉమెన్స్ టీమ్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది.
మహిళల ప్రపంచ కప్ 2025 కోసం పాకిస్థాన్ జట్టు:
ఫాతిమా సనా (కెప్టెన్), మునీబా అలీ సిద్ధిఖీ (వైస్ కెప్టెన్), అలియా రియాజ్, డయానా బేగ్, ఎమాన్ ఫాతిమా, నష్రా సుంధు, నటాలియా పర్వైజ్, ఒమైమా సొహైల్, రమీన్ షమీ, సదాఫ్ షమాస్, సాదియా సిద్రాజ్ అక్బాల్, షర్వాల్ సిద్రాజ్ అక్బాల్, (వికెట్ కీపర్) మరియు సయ్యదా అరూబ్ షా
నాన్-ట్రావెలింగ్ రిజర్వ్లు: గుల్ ఫిరోజా, నజిహా అల్వీ, తుబా హసన్, ఉమ్-ఎ-హని మరియు వహీదా అక్తర్