అత్యంత ప్రమాదకర దేశాల్లో పాకిస్థాన్ ఒకటి: బైడెన్

అత్యంత ప్రమాదకర దేశాల్లో పాకిస్థాన్ ఒకటి: బైడెన్

వాషింగ్టన్: ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర దేశాల్లో పాకిస్థాన్‌ ఒకటి అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలను ఉద్దేశించి బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన డెమోక్రటిక్‌ పార్టీ సమావేశంలో మాట్లాడిన బైడెన్... చైనా, రష్యా దేశాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చైనా అధ్యక్షుడు తన దేశ స్వార్ధం కోసం ఏమైనా చేస్తారని, ఈ క్రమంలో ప్రపంచ మానవాళికి అనేక సమస్యలు సృష్టిస్తున్నారని బైడెన్ మండిపడ్డారు. ఉక్రెయిన్ తో యుద్ధానికి దిగిన రష్యా అక్కడ రక్తపాతం సృష్టిస్తోందని ఫైర్ అయ్యారు.

ఇలా ఈ రెండు దేశాల గురించి మాట్లాడుతన్న క్రమంలో బైడెన్ పాకిస్థాన్ గురించి పై వ్యాఖ్యలు చేశారు. ఇక.. అమెరికాతో సంబంధాలను బలపరుచుకోవాలని చూస్తున్న పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ కు  బైడెన్ వ్యాఖ్యలు శాపంగా మారాయి. పాకిస్థాన్ పై బైడెన్ తాజా వ్యాఖ్యలతో పాకిస్థాన్ లో నిరసనలు వెల్లువెత్తున్నాయి.