
న్యూఢిల్లీ: పాకిస్తాన్కు వచ్చే సింధూ జలాల నీళ్లను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్ను హెచ్చరించారు. సింధూ జలాలను మళ్లించే ఏ నిర్మాణాన్నైనా పేల్చివేస్తామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం పాక్లో ఓ టీవీ చానెల్లో ఆయన మాట్లాడారు. సింధూ జలాలను మళ్లించే ఏ ప్రయత్నమైనా తమ దేశంపై దురాక్రమణగానే చూస్తామన్నారు. ఇండస్ బేసిన్లో భారత్ డ్యామ్లు కడితే అది పాక్పై దురాక్రమణే అని, అలాంటి నిర్మాణాలను పేల్చివేస్తామని పేర్కొన్నారు.
కాగా.. ఖవాజా రెచ్చగొట్టే వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. పాకిస్తాన్ ఎంతగా భయపడుతున్నదో ఖవాజా మాటల్లో అర్థమవుతోందని బీజేపీ జాతీయ ప్రతినిధి షాన్ వాజ్ హుస్సేన్ కౌంటర్ ఇచ్చారు. పాక్కు ఆయన రక్షణ మంత్రిగా ఉన్నా.. ఆయనకు ఏమాత్రం నియంత్రణ లేదని, ఆయన కేవలం ఓ స్టేట్మెంట్ల మినిస్టర్ అని షాన్ వాజ్ ఎద్దేవా చేశారు. సింధూ జలాలను అడ్డుకోవడంతో శత్రు దేశంలో భయం మొదలైందని, వారికి రాత్రిపూట నిద్రకూడా పట్టడం లేదని చురకలంటించారు.